కెసిఆర్ తెలంగాణవాది కారు: మోత్కుపల్లి ఫైర్
తెలంగాణపై కాంగ్రెసు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై కెసిఆర్ ఏం చెప్తారని ఆయన అడిగారు. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తుంటే కెసిఆర్ ఎఁదుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కెసిఆర్ తెలంగాణవాదాన్ని ఫణంగా పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలిపేందుకే ఢిల్లీకి వెళ్లినట్టు మంత్రి డికె అరుణ తెలిపారు. తెలంగాణలోని పెద్దలందరిని కూడా కలిసినట్టు ఆమె తెలిపారు. తెలంగాణను వెంటనే ప్రకటించేలా ఒత్తిడి తేవాలని వారిని కోరినట్టు ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మంత్రులు రాజీనామా చేస్తే తెలంగాణ రాదని, ఎంపీలు రాజీనామా చేస్తే తెలంగాణ సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. తెలంగాణపై ప్రకటన ఆలస్యం చేస్తే కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని ఆమె అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో డికె అరుణ ఇటీవల ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఆమె ఎఐసిసి నాయకులు ఆస్కార్ ఫెర్నాండెజ్, మోతీలాల్ వోరా తదితరులను కలిశారు. ఆమె ఢిల్లీ పర్యటనలపై విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచన మేరకే ఆమె ఢల్లీ వెళ్లినట్లు విమర్శలు వచ్చాయి.