ఒప్పుకోలేదని ఇంటర్ యువతిని రైలు నుండి తోసేశాడు
నిందితుడు అమ్మాయి క్లాస్మేట్. అతని ప్రేమ విషయంలో ఆ అమ్మాయి వెనక్కి తగ్గడంతోనే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు, తృణమూల్ ఛత్రా పరిషత్ సభ్యులు కల్నా జిఆర్పి స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అమ్మాయిని రైలు నుండి తోసేసి చంపిన నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసులు అమ్మాయి శవాన్ని స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన తర్వాతనే శవాన్ని తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం పది గంటల సమయంలో మృతి చెందిన యువతి తన ట్యూషన్ క్లాసులకు వెళ్లి తిరిగి వస్తోంది. ఈ సమయంలో ప్రేమించిన యువకుడు ఆమెను పలకరించాడు.
ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆమె అతని ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో ఆగ్రహం పట్టలేక అతను ఆమెను రైలు నుండి తోసేశాడని పోలీసులకు స్నేహితులు చెప్పారు. తాను కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.