సరైన సమయంలో: బాలకృష్ణ, జూఎన్టీఆర్పై టిడిపి
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హామీలపై బొత్స కామెంట్ చేయడం సరికాదన్నారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, బడ్జెట్ గురించి ఆయనకు తెలుసునన్నారు. బొత్స హితవు పలకాల్సిన అవసరం లేదన్నారు. పిల్ల కాంగ్రెసు, తల్లి కాంగ్రెసులకు అంతిమ యాత్ర ప్రారంభమైందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
మధ్యంతర ఎన్నికలు పెడితే సత్తా చూపిస్తాం
మధ్యంతర ఎన్నికలు పెడితే తమ పార్టీ సత్తా చూపిస్తామని శ్రీకాకుళం జిల్లాలో టిడిపి నేత ఎర్రన్నాయుడు అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వెంటిలెటర్ పైన ఉన్నాయన్నారు. కాంగ్రెసుకు దమ్ముంటే మధ్యంతర ఎన్నికలు నిర్వహించారని ఎర్రన్నాయుడు సవాల్ చేశారు.
తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు బొత్సకు లేదన్నారు. రాష్ట్ర బడ్జెట్ గురించి పిసిసి చీఫ్ బొత్సకు ఏం తెలుసునన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు.