హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులపై తెలంగాణ ఒత్తిడి: పిఎంను కలిసే యత్నాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత మంత్రులు ఈ రోజు(మంగళవారం) హైదరాబాద్‌కు రానున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు, శాసనసభ్యుల కంటే మంత్రుల పైనే తెలంగాణవాదుల ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని కోరేందుకు మంత్రులు ప్రధానిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.

జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు మన్మోహన్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాదుకు రానున్నారు. తెలంగాణవాదులు ఆయన పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. టి కాంగ్రెసు ఎంపీలు కూడా ప్రధాని పర్యటనను స్వాగతించడం లేదు. సొంత పార్టీ ఎంపీలు తెలంగాణ కోసం తమ వంతు నిరసనలు తెలియజేస్తున్న నేపథ్యంలో మంత్రుల పైన తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో వారు ప్రధానిని కలవాలని నిర్ణయించుకున్నారు.

ఇందుకోసం అపాయింటుమెంటు కూడా కోరినట్లుగా తెలుస్తోంది. అయితే వారికి అపాయింటుమెంట్ ఇప్పటి వరకు దొరకలేదని సమాచారం. తెలంగాణవాదం వినిపించేందుకు తమకు హైదరాబాదులో వీలుకాని పక్షంలో ఢిల్లీ వెళ్లేందుకు కూడా మంత్రులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అయితే హైదరాబాదులో తమకు కలిసే అవకాశం లేకుంటేనే ఢిల్లీ వెళ్లాలని వారు యోచిస్తున్నారని తెలుస్తోంది.

ప్రధానిని కలిసి తెలంగాణ విషయంలో తమపై ఉన్న ఒత్తిడిని వారు ఆయన దృష్టికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. అలాగే తెలంగాణ ఆవశ్యకతను, దానివల్ల కలిగే లాభాలను వారు ఆయనకు వివరించనున్నారని తెలుస్తోంది. పార్టీకి కలిగే లాభాన్ని కూడా వారు తెలపనున్నారు.

English summary

 Telangana region ministers are trying to meet PM Manmohan Singh on Tuesday to appeal on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X