వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఎంతకైనా తెగిస్తాడు, రెండు ధ్యేయాలు: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
కడప: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సోమవారం మండిపడ్డారు. ఆమె కర్నూలు జిల్లాలో ఐదో రోజు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన పాదయాత్ర రెండు ధ్యేయాలతోనే కొనసాగుతోందని ఆమె చెప్పారు.

ఒకటి మొద్దు నిద్ర నటిస్తున్న కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిద్రలేపటం, రెండు మొద్దు నిద్రపోతున్న ప్రతిపక్ష పార్టీని ఎండగట్టడం అన్నారు. ఈ రెండు ధ్యేయాలతోనే తాను యాత్ర చేస్తున్నానని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కిరణ్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. సిబిఐ నుండి తప్పించుకునేందుకే ఆయన అవిశ్వాసం పెట్టడటం లేదని విమర్శించారు.

చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో చేస్తున్న పాదయాత్ర ప్రజల కోసం కాదని, తాను అధికారంలోకి వచ్చేందుకే అన్నారు. తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రజల కోసమే ప్రజా జీవితంలోకి వచ్చానని చెప్పారు. అందుకోసమే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించానని చెప్పారు.

ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారానే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అన్నారు. టిడిపి, కాంగ్రెసు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వైయస్ ప్రభంజనాన్ని అడ్డుకట్ట వేయాలని జగన్‌ను జైలుకు పంపించారన్నారు. అందుకే షర్మిల పాదయాత్ర చారిత్రక అవసరంగా మారిందని అన్నారు.

English summary

 YSR Congress party chief YS Jaganmohan Reddy's sister Sharmila lashed out at TDP chief Nara Chandrababu Naidu on Monday in her Maro Praja Prastana padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X