డిసెంబర్ 9 ప్రకటన: తెలంగాణకోసం ఎబివిపి పాదయాత్ర

కేంద్రం తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండి వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేయాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి విద్యార్థి మహా పాదయాత్ర పేరుతో నవంబర్ 26 నుండి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎబివిపి నాయకులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసి వెనక్కి వెళ్లిందని, తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల నుండి సుమారు 500 మంది విద్యార్థులతో ఈ మహాపాదయాత్ర చేపడుతున్నామన్నారు. నవంబరు 26న తెలంగాణలోని ఐదు ప్రాంతాల నుండి ఒకేసారి ఈ పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాలను కలుపుకుని సుమారు పదిహేను వందల కిలో మీటర్ల వరకు ఈ పాదయాత్ర ఉంటుందన్నారు. ఈ పాదయాత్ర డిసెంబరు 7న హైదరాబాద్కు చేరుకుంటుందని చెప్పారు.
అదే రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. 12 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉంటుందన్నారు. మీడియా సమావేశంలో ఎబివిపి జాతీయ కార్యదర్శి కడియం రాజు, జాతీయ కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి పాండు రంగా రెడ్డిలు తెలిపారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications