లవ్ అఫైర్: యువకుడి హత్య, యువతి మృతి
ఇంటర్మీడియట్ చదువుతున్న దేవేందర్ను మిత్రులే ప్రేమ వ్యవహారంలో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పర్వతగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఓ అమ్మాయిని దేవేందర్, శ్రీకాంత్ అనే ఇద్దరు యువకులు ప్రేమిస్తున్నారు. అమ్మాయి విషయంలో ఇరువురి మధ్య తగాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దేవేందర్ను హత్య చేయాలని శ్రీకాంత్ పథకరచన చేశాడు.
మిత్రులతో కలిసి పార్టీ చేసుకుందామని శ్రీకాంత్ దేవేందర్ను పాకాలకు ఆహ్వానించాడు. అక్కడ మిత్రులతో కలిసి దేవేందర్ను శ్రీకాంత్ కొట్టి చంపాడు. కుమారుడు కనిపించకపోవడంతో దేవేందర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దేవేందర్ మిత్రులను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య విషయం బయటపడింది. దేవేందర్ మృతదేహం కోసం పాకాల అడవుల్లో పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలావుంటే, తిరుపతిలోని ఎర్రానిపాళ్యంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.