వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్ రెడ్డి సెల్ఫ్‌గోల్: సోనియా ఆగ్రహంతో డిమోషన్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ రోజు(ఆదివారం) జరిగిన కేంద్ర పునర్వ్యవస్థీకరణలో జైపాల్ రెడ్డిని పెట్రోలియం శాఖ నుండి తప్పించి సైన్స్ అండ్ టెక్నాలజీని అప్పగించారు. ప్రాధాన్యత కలిగిన పోస్టు నుండి ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టుకు పంపించడానికి కారణం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహానికి గురి కావడమే కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సొంతపార్టీ ఎంపీల తెలంగాణ హడావుడి వెనుక జైపాల్ రెడ్డి ఉన్నారని సోనియా గాంధీ భావించడం వల్లనే ఆయనకి డిమోషన్ కలిగిందని అంటున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమంలో ఎంపీలు పలువురు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వారు అధిష్టానికి సైతం అల్టిమేటం జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి.

వీటన్నింటి వెనుక జైపాల్ రెడ్డియే ఉన్నారని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. జైపాల్ రెడ్డి పట్ల సోనియా గాంధీ మొదటి నుండి అభిమానంతో ఉండేవారు. అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తతో పాటు ఆచితూచి మాట్లాడటం, చిల్లర రాజకీయాలు చేయక పోవడం తదితరాలు సోనియాకు ఆయన పట్ల అభిమానం పెరగడానికి కారణాలు.

కానీ తెలంగాణ ఎంపీలు రెచ్చిపోవడం వెనుక ఆయన ఉన్నారని సోనియా భావిస్తున్నారట. ఎంపీలను రెచ్చగొట్టడమే కాకుండా ఆయన మాత్రం అధిష్టానానికి అండగా ఉంటున్నట్లుగా సైలెంట్‌గా ఉండటాన్ని అధినేత్రి గమనించిందని, అందుకే అతనికి డిమోషన్ జరిగిందని అంటున్నారు.

English summary

 Central Minister Jaipal Reddy has changed from Petroleum to IT and Technology ministry on Sunday reshuffle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X