వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెదనాన్నకు ఆత్మవిశ్వాసం ఎక్కువ: హీరో నారా రోహిత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Rohit
మహబూబ్‌నగర్: శుక్రవారం రాత్రి స్వల్పంగా గాయపడ్డ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తనయుడు, ప్రముఖ హీరో నారా రోహిత్ శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పెదనాన్నకు ఎంతో ఆత్మ విశ్వాసం ఉంటుందని, ఆ కారణంగానే ఇంత భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయి.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

అంతకుముందు హీరో జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. అంతకుముందు రోజు చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని తెలియగానే ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ హైదరాబాదు నుండి మహబూబ్‌నగర్ చేరుకున్నారు. వారిద్దరు హుటాహుటినా గద్వాలకు చేరుకున్నారు. అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి వేదిక కూలిందని తెలియగానే చంద్రబాబుకు పరామర్శల వెల్లువ ప్రారంభమైంది.

శుక్రవారం హీరోలు నారా రోహిత్, జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, చంద్రబాబు సోదరిమణులు రాజేశ్వరి, హైమావతి, నందమూరి రామకృష్ణ సతీమణి జయశ్రీ తదితరులు చంద్రబాబు నాయుడును పరామర్శించిన వారిలో ఉన్నారు. భువనేశ్వరి, లోకేష్ దగ్గరుండి బాబును చూసుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుండి బాబు తిరిగి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.

English summary
Hero Nara Rohit has met Telugudesam chief Nara Chandrababu Naidu near Gadwal of Mahaboobnagar district. He said that Chandrababu will get well soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X