బూట్లతో ప్రార్థన: షర్మిల దిష్టిబొమ్మ దగ్ధం, సారీ చెప్పండి
సోమవారం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేత లాల్ వజీర్ ఆధ్వర్యంలో షర్మిల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతకుముందు ఆమె బొమ్మను ఊరేగించారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షర్మిల బూట్లతో మసీదులో ప్రార్థనలు చేయడమేమిటని వారు ప్రశ్నించారు. ముస్లిం మైనార్టీలను అవమానించడం వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి మొదటి నుండి అలవాటేనని టిడిపి నేత కోడెల శివప్రసాద్ విమర్శించారు.
కాగా ఆదివారం షర్మిల బూట్లతో ఓ మసీదులో ప్రార్థనలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. మరో ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ మసీదులో ఆమె బూట్లతోనే ప్రార్థనలు చేశారు. దీనిపై ముస్లింలు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సోమవారం షర్మిల అనంతలో తన పాదయాత్రను కొనసాగించారు. తన సోదరుడు జగన్తోనే రామ రాజ్యం సాధ్యమని, తన తండ్రికి, సోదరుడికి ఉన్నది చంద్రబాబుకు లేదని విశ్వసనీయత అని విమర్శించారు. చంద్రబాబుకు ప్రభుత్వాన్ని దించే శక్తి ఉన్నా మిన్నకుండిపోయారన్నారు. కాంగ్రెసుకు అండగా నిలుస్తున్నారని విమర్శించారు.