వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరం నాది కాదు, వైయస్ మంత్రి వర్గానిదే: ఐఏఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Ratna Prabha
న్యూఢిల్లీ: రాంకీకి లబ్ధి చేకూరిన విషయంలో తన తప్పేమీ లేదని సీనియర్ ఐఏఎస్ రత్న ప్రభ సుప్రీం కోర్టులో గురువారం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. రాంకీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించినా వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గం తన మాట వినలేదని చెప్పారు. రాంకీకి స్టాంప్ డ్యూటీ మినహాయిస్తూ 2008 డిసెంబర్ 4న జివో విడుదలయిందని, మున్సిపల్ పరిపాలనాశాఖ రెవెన్యూ హోదాలో ఉన్న తనకు ప్రతిపాదన పంపినప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు.

తాను ప్రభుత్వ ఆదాయానికి గండిపడకూడదన్న ఉద్దేశ్యంతోనే దానిని వ్యతిరేకించానన్నారు. ప్రభుత్వం నిర్ణయం కోసం దానిని మంత్రి మండలి ముందుకు తీసుకు వెళ్లినప్పుడు మంత్రివర్గం తన అభిప్రాయాన్ని విస్మరించిందని చెప్పారు. తనను ఈ కేసులో ఉద్దేశ్య పూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

ఐటి కార్యదర్సిగా తాను పని చేశానని, మేధావులు తనను అభినందించారని, దీంతో దురుద్ధేశంతో తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఈ కేసులో ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేయడంతో పాటు న్యాయస్థానాన్ని తప్పు దోవ పట్టించడానికి ప్రయత్నించిన పిటిషనర్‌ను శిక్షించాలని రత్నప్రభ తన కౌంటర్ అఫిడవిట్‌లో కోర్టును కోరారు.

English summary

 K Ratna Prabha, the Karnataka cadre senior IAS officer who earlier worked with the AP state government as principal secretary of various wings like revenue, municipal administration and information technology, filed an affidavit in the Supreme Court saying that she opposed the proposed stamp duty exemptions sought to be given by YSR regime to Ramky Estates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X