హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీలం తుఫాను: దర్శకుడు గుణశేఖర్ 5 లక్షల విరాళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gunasekhar
హైదరాబాద్: రాష్ట్రంలో నీలం తుఫాను బాధితుల కోసం ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన ఈ డబ్బును ఇచ్చారు. గుణశేఖర్ తన పిఆర్‌వో ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రజలకు పిలుపును ఇచ్చారు.

నీలం తుఫాను కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాలో నీట మునిగిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో పలు గ్రామాలు నీట మునిగాయి. లక్షల ఎకరాల పంటలు నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇరవై ఐదు మందికి పైగా మృతి చెందారు. వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమై పోయాయి.

ఇలా నీలం సృష్టించిన బీభత్సం పలు జిల్లాలను కకలావికలం చేసింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు ముంపు ప్రాంతాల్లో సర్వేలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ నిన్న, నేడు పర్యటిస్తున్నారు. బాధితులను ఓదార్చుతున్నారు.

English summary
Tollywood director Gunasekhar gave Rs.5 lakh to chief minister relief fund to help Neelam affected people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X