వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరాచీ ఆర్మీ క్వార్టర్స్‌పై ఆత్మాహుతి దాడి: ఇద్దరు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

2 killed, 14 injured in high-intensity blast in Karachi
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో తీవ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. పాకిస్తాన్‌లోను ముఖ్య పట్టణమైన కరాచీలో బాంబు పేలుడు సంభవించింది. పట్టణం సమీపంలోని ఆర్మీ రేంజర్ హెడ్ క్వార్టర్స్‌పై గురువారం ఉదయం జరిగిన ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు కారణం ఆత్మాహుతిదళమే కావొచ్చునని తెలుస్తోంది. పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును ఆత్మాహుతి దళ సభ్యుడు ఆర్మీ రేంజర్ హెడ్ క్వార్టర్ కార్యాలయం వద్ద పేల్చి వేశాడు. గాయలపాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఆర్మీ రేంజర్ హెడ్ క్వార్టర్ కరాచీలోని ఉత్తర నజిమాబాద్ ప్రాంతంలో ఉంది. ఈ పేలుడు పట్టణం మొత్తం వినిపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చుట్టుపక్కల ఉన్న పలు భవంతులు దెబ్బతిన్నాయి. కాగా పోలీసులు మంటలను గంటన్నరలో అదుపులోకి తీసుకు వచ్చారు.

స్మోక్ అంతా ఆకాశంలోకి వెళ్లింది. చనిపోయిన ఇద్దరిలో ఒకరు ఘటనా స్థలంలో మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంకా అధికారిక ప్రకనట వెలువడలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లుగా సమాచారం.

English summary
Two Pakistani rangers were killed while 14, including civilians, were injured in a high-intensity suicide bomb blast at the Rangers Headquarters in North Nazimabad area of Karachi early on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X