హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ కంపెనీతో సంబంధం లేదు, మార్పులేదు: రాయపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
హైదరాబాద్: రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని గుంటూరు పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు శుక్రవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను మారుస్తారంటూ వస్తున్న ప్రచారాలన్నీ కేవలం ఊహాగానాలని ఆయన కొట్టి పారేశారు. తమ పార్టీ అధిష్టానం రాష్ట్రంలో మార్పు విషయంపై ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు.

పోలవరం టెండర్లు దక్కించుకున్న ట్రాన్సుట్రాయ్ కంపెనీ తనకు సంబంధించింది కాదని రాయపాటి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ను అడగాలని సూచించారు. తనకు చెందిన ట్రాన్సుట్రాయ్ కంపెనీకి పోలవరం టెండర్లు దక్కాయని చెబుతున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి అన్నారు.

కాగా పోలవరం టెండర్లు ట్రాన్సుట్రాయ్ కంపెనీకి దక్కిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ రాయపాటికి చెందిందిగా వార్తలు వచ్చాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ కంపెనీ రాయపాటిదిగా చెప్పారు. రాయపాటి సతీమణి ఈ కంపెనీ ఎండిలలో ఒకరిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటిని రాయపాటి సాంబశివ రావు కొట్టి వేయడం గమనించదగ్గ విషయం.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao said Kiran Kumar Reddy will not replaced any one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X