ఆ కంపెనీతో సంబంధం లేదు, మార్పులేదు: రాయపాటి
పోలవరం టెండర్లు దక్కించుకున్న ట్రాన్సుట్రాయ్ కంపెనీ తనకు సంబంధించింది కాదని రాయపాటి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఏదైనా ఉంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ను అడగాలని సూచించారు. తనకు చెందిన ట్రాన్సుట్రాయ్ కంపెనీకి పోలవరం టెండర్లు దక్కాయని చెబుతున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆ కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి అన్నారు.
కాగా పోలవరం టెండర్లు ట్రాన్సుట్రాయ్ కంపెనీకి దక్కిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ రాయపాటికి చెందిందిగా వార్తలు వచ్చాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ఈ కంపెనీ రాయపాటిదిగా చెప్పారు. రాయపాటి సతీమణి ఈ కంపెనీ ఎండిలలో ఒకరిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నింటిని రాయపాటి సాంబశివ రావు కొట్టి వేయడం గమనించదగ్గ విషయం.
Comments
rayapati sambasiva rao kiran kumar reddy congress polavaram hyderabad రాయపాటి సాంబశివ రావు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పోలవరం హైదరాబాద్
English summary
Guntur MP Rayapati Sambasiva Rao said Kiran Kumar Reddy will not replaced any one.
Story first published: Friday, November 9, 2012, 15:49 [IST]