మేం ఉన్నాం: షర్మిల, చిరంజీవి మోసగాడు: భూమన
తమ సమస్యలను ఆమెకు విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు అసంతృప్తికి గురి కావొద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం వచ్చాక అందర్నీ ఆదుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో రైతుల సమస్యను తమ ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తారన్నారు.
చిరంజీవి అభివృద్ధి చేస్తాడా
కేంద్రమంత్రి చిరంజీవి పర్యాటక రంగాన్ని ఎలా అభివృద్ది చేస్తారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి చిత్తూరులో ప్రశ్నించారు. చిరంజీవి పచ్చి మోసగాడని మండిపడ్డారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరుపతి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
అలాంటి వ్యక్తి భారత పర్యాటక రంగాన్ని ఏవిధంగా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుపతిని దత్తత తీసుకుంటానని చిరంజీవి అప్పట్లో ప్రకటించారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.