అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త, అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anantapur
అనంతపురం/మహబూబ్‌నగర్: అనంతపురం జిల్లాలో ఓ భర్త తన భార్యను హత్య చేసి ఇంట్లో పాతి పెట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం పట్టణంలోని శాంతినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికల ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించడంతో ఇంట్లో భార్య మృతదేహం బయటపడింది.

పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతను తన తప్పును అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం తన భార్యను చంపేసి పాతి పెట్టినట్లుగా నిందితుడు అంగీకరించాడు.

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సమీపంలో బోరువాకలో ముగ్గురు గిరిజన బాలికలపై అత్యాచారయత్నం జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిని ఓ ఆటో డ్రైవర్ రక్షించాడు.

చిత్తూరు జిల్లా పాకాల రైల్వే స్టేషన్ జంక్షన్‌లో రైలు ఎక్కుతూ జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో మహిళ గాయపడింది. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

English summary

 A man from Anantapur district was arrested by police for killing his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X