వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపి ఆఫర్ తిరస్కరించిన యడ్డీ, అర్ధరాత్రి జైట్లీ చర్చలు
అయితే ఇందుకు యడ్యూరప్ప నిర్ద్వంధంగా తోసిపుచ్చినట్లుగా సమాచారం. తనకు పార్టీలో ఎలాంటి పదవులు అవసరం లేదని తేల్చి చెప్పారట. తనను పార్టీ ఇన్నాళ్లుగా నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు కొత్త పార్టీ పెడతానని చెబితే బుజ్జగింపుల కోసం వచ్చారని యడ్డీ విమర్శించారట. తనకు 60 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల మద్దతు ఉందని యడ్యూరప్ప జైట్లీకి చెప్పారని సమాచారం.
అయితే తాను ప్రభుత్వాన్ని పడగొట్టనని, కొత్త పార్టీ పెడతానని, వచ్చే ఎన్నికల్లో మాత్రమే తన పార్టీ తరఫున పోటీ చేస్తామని జైట్లీకి తెలిపారని సమాచారం. యడ్డీని జైట్లీ ఓ రహస్య ప్రదేశంలో కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే జైట్లీ మాత్రం పార్టీని వీడవద్దని, ఏ పదవి ఇచ్చేందుకైనా సిద్ధమని ఆఫర్ చేశారట. కానీ జైట్లీ ఎంతగా చెప్పినా యడ్యూరప్ప మాత్రం కొత్త పార్టీకే మొగ్గు చూపారని తెలుస్తోంది.
Comments
English summary
Karnataka former minister Yeddyurappa rejected Bharatiya Janaya Party's offer on Saturday.
Story first published: Sunday, November 11, 2012, 11:37 [IST]