విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండుగపూట విషాదం: బాణసంచా పేలి ఒకరి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayanagaram
హైదరాబాద్: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. గ్రామపంచాయతీ భవన సమీపంలో బాణసంచా పేలింది. ఈ ప్రమాదంలో బొడసింగి రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాల పాలయ్యారు. గాయపడినవారిని విజయనగం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. అక్కడ అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా విజయనగరం జిల్లాలో బాణసంచా పేలి ఆరుగురు మృతి చెందారు. అక్రమ బాణసంచా తయారీని అదుపు చేయకపోవడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

ఇదిలావుంటే, బాణసంచా కాలుస్తుండగా ఇటీవల ప్రమాదం సంభవించి ఏడుగురు పిల్లలు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గాయపడ్డారు. వారు విశాఖపట్నంలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న పిల్లలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం పరామర్శించారు. వారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు.

ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. అయితే, దీపావళి మందుగుండుకు నిరుటి కన్నా గిరాకీ తగ్గింది.

English summary
One has died in Vijayanagaram district as the blast of crackers took place. Three more persons injured in this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X