లక్షా45వేల కోట్లు ఎక్కడివి: చిదంబరం, మళ్లీ 2జి వేలం

కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మనీష్ తివారి అన్నారు. 2014 వరకు మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో యూపిఏ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2జి స్పెక్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చిందని, సంచలన వార్తలు వచ్చాయని, వాటి ప్రభావం ఇటీవల జరిగిన వేలంపై పడిందని ఆయన చెప్పారు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే 2జి స్పెక్ర్టం వేలం జరిగిందని కపిల్ సిబాల్ అన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలలోగా మరోసారి వేలం వేస్తామని ఆయన చెప్పారు. 2జి స్పెక్ట్రంపై సంచలన వార్తలు రావడంతో ఆ ప్రభావం పడిందన్నారు. ఇది దేశ టెలికం అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. అయినప్పటికీ భారత్ ప్రపంచ టెలికాం రంగానికి ధీటుగా ఎదిగేందుకు ఎంతో సమయం పట్టదన్నారు.












Click it and Unblock the Notifications