నాలుగు నెలల తర్వాత భూమికి సునీతా విలియమ్స్

అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మొదటి వ్యోమగామిగా సునీతా విలియమ్స్ నిలిచారు. రష్యా సోయజ్ కమాండర్ యూరీ మాలెస్ చెంకో, జపాన్కు చెందన అకీ హోషీడేలతో కలిసి సునీత కజకిస్తాన్లోని అర్కలిక్ పట్టణ సమీపంలో ఉదయం సోయజ్ టిఎంఏ-05 నౌకలో భూమి పైన అడుగు పెట్టారు.33వ అంతరిక్ష యాత్ర చేపట్టిన వీరు ముగ్గురు 127 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. జూలై 15వ తేదిన వారు అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష కేంద్రానికి సేవలు అందించారు. శనివాలం ఐఎస్ఎస్ నాయకత్వ బాధ్యతలను లాంఛనంగా కెవిన్ ఫోర్డ్ అనే మరో వ్యోమగామికి అప్పగించారు.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వీరు మరమ్మతులు చేశారు. అంతరిక్షంలో సునీత ఏడుసార్లు స్పేస్ వాక్ చేశారు. కాగా సునీతా విలియమ్స్ 322 రోజుల పాటు త్వరలో అంతరిక్షంలో గడపనున్నారు.












Click it and Unblock the Notifications