Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కసబ్‌కు నరకమే ప్రాప్తిస్తుంది: బాధిత స్త్రీ నూర్జహాన్

Ajmal Kasab
నిజామాబాద్/ హైదరాబాద్: ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరి తీయడాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నూర్జహాన్ స్వాగతించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీకి చెందిన ఓ నిరుపేద కుటుంబం ఉగ్రవాదుల కాల్పుల్లో చిన్నాభిన్నమైంది. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో నూర్జహాన్ అనే బాధిత మహిళ తన కూతురు అమీనాబేగం (20)ను కోల్పోయింది. భర్త అబ్దుల్ రషీద్‌కు మూడు బుల్లెట్లు దూసుకుపోయి వికలాంగుడిగా మారి, గాయాలతో 14 మాసాల క్రితం మృతి చెందాడు.

ముంబైలోని హాజీఅలీ దర్గాను సందర్శించేందుకు వెళ్లిన నూర్జహాన్ కుటుంబీకులు నిజామాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యేందుకు 2008 నవంబర్ 26వ తేదీన ఛత్రపతి శివాజీ టెర్మినల్ (సిఎస్‌టి) రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ప్లాట్‌ఫాం మీద రైలురాక కోసం వీరంతా నిరీక్షిస్తున్న సమయంలో ఉగ్రవాదులు తెగబడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దీంతో నూర్జహాన్ కుమార్తె అమీనాబేగం (20) తుపాకీ తూటాలకు బలై అక్కడికక్కడే మరణించింది. ఆమెకు అంతకు ముందు ఏడాది క్రితమే వివాహమైంది.

కూతురు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత భర్త మరణించడం వల్ల ఆమె జీవచ్ఛవంలా కాలం వెళ్లదీస్తోంది. బుధవారం అజ్మల్ కసబ్‌కు ఎరవాడ జైలులో ఉరి తీశారని ప్రసార మాద్యమాల ద్వారా తెలుసుకుని నూర్జహాన్ కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలస్యం అయినప్పటికీ తమకు న్యాయం జరిగిందని, అల్లా తమ మొరను ఆలకించాడంటూ నూర్జహాన్ కుటుంబీకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుటుంబ సభ్యులకు మిఠాయిలు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. కసబ్‌ను ఉరి తీయడం వల్ల తన కూతురు ఆత్మకు శాంతి చేకూరిందని నూర్జహాన్ అన్నారు. కసబ్‌కు నరకమే ప్రాప్తిస్తుందని ఆమె అన్నారు.

ముంబై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో నిందితుడు కసబ్‌కు ఉరిశిక్ష వేయడం పట్ల అప్పటి కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదులోని నేరేడ్‌మెట్ డిఫెన్స్‌కాలనీలో నివసించే విజయ్‌రావుమంజా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నేరేడ్‌మెట్ డిఫెన్స్‌కాలనీకి చెందిన విజయ్‌రావుమంజా (47) ముంబయి తాజ్‌హోటల్‌లో చెఫ్‌గా పనిచేసేవారు. ఇతనికి భార్య ఫరిదామంజా, కుమారుడు రోహన్ ఉన్నారు. 2008లో ముంబయి తాజ్‌లో జరిగిన కాల్పుల్లో విజయ్‌మంజా చనిపోయాడు. అతడు మరణించిన ఆరునెలలకు బెంగతో భార్య ఫరీదా చనిపోయింది.

కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం కసబ్‌కు ఉరిశిక్ష పడటంతో విజయ్ మంజా సోదరుడు వినోద్ హర్షం వ్యక్తం చేశారు. చనిపోయిన తన తమ్ముడు ఎలాగు తిరిగిరాడని ఇలాంటి వారిని ఉరితీయడం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడినవారవుతారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+