ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేసిన టెక్కీ అరెస్టు
లక్నో విశ్వవిద్యాలయంలో ఎంఎస్ కోసం అక్తర్ దరఖాస్తు పెట్టుకున్నాడని, ప్రధాని సిఫార్సు లేఖ అంటూ సంతకం ఫోర్జరీ చేసి దానికి జత చేశాడని సిబిఐ అధికారులు చెప్పారు. లక్నో విశ్వవిద్యాలయం అధికారులు అతనికి సీటు ఇచ్చి, సిఫార్సు మేరకు సీటు ఇచ్చామని తెలియజేస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు.
లక్నో విశ్వవిద్యాలయం అధికారుల లేఖను చూసిన ప్రధాని కార్యాలయం అధికారులు తాము ఏ విద్యార్థికి కూడా సిఫార్సు చేయలేదని జవాబు రాశారు. విచారణ జరిపిన అనంతరం లక్నో విశ్వవిద్యాలయం అధికారులు ప్రధాని కార్యాలయానికి వివరాలను పంపించారు. ప్రధాని కార్యాలయం అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు సిబిఐ అధికారులు దర్యాప్తు చేపట్టి అక్తర్ను అరెస్టు చేశారు.
సిఫార్సు లేఖ రాయడానికి అక్తర్ ప్రధాని లెటర్ హెడ్ను ఫోర్జరీ చేశాడని సిబిఐ అధికారులు చెప్పారు. అక్తర్ హైదరాబాదులోని హిమాయత్నగర్లో గల ఓ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు సమాచారం. పర్షాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్కు చెందినవాడని తెలుస్తోంది.