హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య, భర్తపై మహిళ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Woman commits suicide with her children
హైదరాబాద్/ బళ్లారి: రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఎర్రగోవిందతండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు మంజుబాయ్(30), విశాల్(9), నిఖిత(5), విదిత(3)గా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే ఆ మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.

భర్తపై ఫిర్యాదు చేసిన మహిళ

కన్నబిడ్డలను అమ్మాలని భర్త యత్నిస్తున్నాడంటూ గురువారం ఉదయం హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి పశ్చిమగోదావరి జిల్లా వాసి పద్మ ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఆడపిల్లలను అమ్మాలని భర్త యత్నిస్తున్నాడని, స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని హోంమంత్రి ఎదుట పద్మ రోదించారు.

కోర్టులో హాజరైన బిటెక్ విద్యార్థి

బీటెక్ విద్యార్ధి అక్తర్‌ను గురువారం ఉదయం సిబిఐ అధికారులు హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. లక్నో యూనివర్సిటీలో ఎంఎస్ సీటు కోసం ప్రధాని ఫోర్జరీ సంతకంతో సిఫార్సు లేఖ తయారు చేసిన కేసులో అక్తర్ నిందితుడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు అక్తర్‌ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు.

బళ్లారి ప్రమాదంలో అయ్యప్ప భక్తుల మృతి

కర్ణాటకలోని బళ్లారి సమీపంలోని హలకుంది దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ఆగి వున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మరో తొమ్మిది మందిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులందరినీ బళ్లారి వాసులుగా పోలీసులు గుర్తించారు.

English summary
A woman has commited suicide with her three chilfren at Erragovinda Tanda of Rangareddy district. In another incident five Ayyappa devotees have died at Bellary of Karnataka in a road accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X