పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య, భర్తపై మహిళ ఫిర్యాదు
భర్తపై ఫిర్యాదు చేసిన మహిళ
కన్నబిడ్డలను అమ్మాలని భర్త యత్నిస్తున్నాడంటూ గురువారం ఉదయం హోంమంత్రి సబితాఇంద్రారెడ్డికి పశ్చిమగోదావరి జిల్లా వాసి పద్మ ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఆడపిల్లలను అమ్మాలని భర్త యత్నిస్తున్నాడని, స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని హోంమంత్రి ఎదుట పద్మ రోదించారు.
కోర్టులో హాజరైన బిటెక్ విద్యార్థి
బీటెక్ విద్యార్ధి అక్తర్ను గురువారం ఉదయం సిబిఐ అధికారులు హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. లక్నో యూనివర్సిటీలో ఎంఎస్ సీటు కోసం ప్రధాని ఫోర్జరీ సంతకంతో సిఫార్సు లేఖ తయారు చేసిన కేసులో అక్తర్ నిందితుడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు అక్తర్ను బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు.
బళ్లారి ప్రమాదంలో అయ్యప్ప భక్తుల మృతి
కర్ణాటకలోని బళ్లారి సమీపంలోని హలకుంది దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. ఆగి వున్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మరో తొమ్మిది మందిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులందరినీ బళ్లారి వాసులుగా పోలీసులు గుర్తించారు.