నాగార్జున, మోహన్బాబు జగన్నే కలిశారు: టిడిపి
వైయస్ జగన్ను మే 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు 134 మంది కలిశారని ఆయన చెప్పారు. జగన్కు కల్పిస్తున్న అదనపు సౌకర్యాలపై జైలు సిబ్బంది తమకు ఓ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. చంచల్గుడా జైలు వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంగా మారిందని వ్యాఖ్యానించారు. జైలు అధికారులు జగన్కు ఎలా సహకరిస్తున్నారనే విషయంపై, అక్కడ జరుగుతున్న అవకతవకలపై ది గార్డెనింగ్ వార్డర్ స్టాఫ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, గవర్నర్ నరసింహన్కు రాసిన లేఖను ఆయన మీడియా ముందు పెట్టారు.
నాలుగు నెలల కాలంలో అంత మంది జగన్ను కలుసుకునే అవకాశాన్ని ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మాజీ డిజిపి అరవింద రావు జైలు నుంచి బయటకు వస్తూ తాను తన పాత మిత్రుడు బిపి ఆచార్యను కలిశానని చెప్పారని, అయితే బిపి ఆచార్య ములాఖత్ లిస్టులో అరవింద రావు పేరు లేదని ఆయన చెప్పారు.
అలాగే, తాను నిమ్మగడ్డ ప్రసాద్ను కలిసినట్లు మోహన్ బాబు చెప్పారని, నిమ్మగడ్డ ములాఖత్ జాబితాలో మోహన్ బాబు పేరు లేదని ఆయన చెప్పారు. వీరిలో ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్కు జైలు వేసవి విడిదిలా ఉంటే, జగన్ కుటుంబ సభ్యులకు పిక్నిక్ స్పాట్లా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిజిపిల సహాయ సహకారాలతోనే జగన్కు జైలులో సకల సౌకర్యాలు అందుతున్నాయని ఆయన విమర్శించారు.