జైలు గోడలు బద్దలు కొడ్తామన్నా చర్యలేవి: విహెచ్ ప్రశ్న

నేతల వ్యాఖ్యలపై పోలీసులు స్పందించరేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోని పక్షంలో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్లు నిజాయితీకే పట్టం కట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అలాంటి సమయంలో మంత్రి ధర్మాన ప్రసాద రావును రక్షించే ప్రయత్నాలు చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని తప్పు పట్టారు. మంత్రి ధర్మానను సిబిఐ విచారణకు అనుమతించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా జైలు గోడలు బద్దలు కొట్టి జగన్ను తీసుకు వెళ్తారని జగన్ పార్టీ నేతలు చెప్పగా... ధర్మాన విచారణకు రాష్ట్ర కేబినెట్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
రేవంత్ రెడ్డిపై శ్రీధర్ బాబు ఫైర్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్పై వ్యక్తిగత విమర్శలు సరికాదని మంత్రి శ్రీధర్బాబు టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డికి హితవు పలికారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్కు పార్టీ రంగులు పూయడం తగదని హితవు చేశారు. అసంతృప్తి నేతలతో అధిష్టానం మాట్లాడుతుందని, పెద్దిరెడ్డి వ్యవహారం చిన్న ఇబ్బందిగా ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఎంపిలు హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారని శ్రీధర్బాబు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications