ఎపిలో రాహుల్ దూతలు: జగన్‌తో రాజీపై ఆరా

Rahul Gandhi
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై, లోకసభ సీట్లకు అభ్యర్థుల ఎంపికపై ఆయన దృష్టి పెట్టారు. ఇందుకు గాను తన ప్రతినిధులు ఇద్దరిని రాష్ట్రానికి పంపించారు. రాహుల్ గాంధీ ప్రతినిధులు జితేందర్ దేశ్‌ముఖ్, విశ్వజిత్ రాణే రాష్ట్రానికి వచ్చారు.

రాహుల్ గాంధీ ప్రతినిధులు శనివారంనాడు కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వారు ఆరా తీశారు. జగన్ బలాబలాలను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్‌తో రాజీకి వస్తే లాభమా, నష్టమా అని అడిగారు. వైయస్ జగన్‌తో రాజీకి వస్తే మంచిదని కొంత మంది సూచించినట్లు తెలుస్తోంది.

జగన్‌తో రాజీ గురించి వారు ప్రత్యేకంగా కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. సిబిఐ కేసులు ఎత్తేసి, ముఖ్యమంత్రి పదవి ఇస్తే వైయస్ జగన్ రాజీకి వస్తాడేమోనని జెసి దివాకర్ రెడ్డి వారితో అన్నారు. లోకసభ స్థానాల్లో కొత్త అభ్యర్థులను పోటీకి దింపాలని ఆయన సూచించారు.

రాయలసీమ, కోస్తాల్లో పార్లమెంటు స్థానాలపై రాహుల్ గాంధీ పరిశీలకులు చర్చలు జరిపారు. సిట్టింగ్ పార్లమెంటు సభ్యులపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల్లోని 23 లోకసభ స్థానాల్లో పార్టీ పరిస్థితిపై వారు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత వారు జిల్లాల్లో పర్యటనలు చేయడానికి బయలుదేరి వెళ్లారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి రాహుల్ గాంధీ వారిని పంపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+