అక్కడ కూలితే ఇక్కడ కూల్చేసత్తా ఉంది: కొండా సురేఖ
రాయదుర్గం హైలెవల్ కెనాల్కు నీరు నిలిపివేయడం దారుణమని అనంతపురం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి అనంతపురం జిల్లాలో అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా కిరణ్ ప్రభుత్వం ప్రేరేపిస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. తక్షణమే హెచ్ఎల్సికి నీటిని ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నేను రాజీనామా చేసినప్పుడు రాలేదేం?
తెలంగాణ కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు పార్టీ నేతలు ఎవరూ కలిసి రాలేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హైదరాబాదులో విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడుకుందాం... అధిష్టానమే తెలంగాణ ఉస్తుందని వారు వెనక్కి తగ్గారన్నారు. తాను వదిలేసిన మంత్రి పదవి కోసం ఇప్పుడు కొంతమంది లాబీయింగ్ కూడా చేశారన్నారు. ఇప్పుడు ఆ నేతలే తెలంగాణ కోసం ఫ్రంట్ పెట్టాలని అంటున్నారని విమర్శించారు.
చిత్తశుద్ధి లేని ఇలాంటి ప్రయత్నాల వలన ఫలితాలు ఉండవని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ మంత్రులు తనతోపాటే రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో వచ్చి ఉండేదన్నారు. తెలంగాణపై స్పష్టత రాకుంటే ప్రజల కోరిక మేరకు నడుచుకుంటానని ఆయన చెప్పారు.