బి.కాం. అమ్మాయి దారుణ హత్య: రైలు కిందపడి ఇద్దరు
ఆమె మృతికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. జయలక్ష్మి పైన ఎలాంటి అత్యాచార ప్రయత్నం జరగలేదని పోలీసులు భావిస్తున్నారు. ఆమె బట్టలు చిరగడం, శరీరంపై గాట్లు లేకపోవడం, పెనుగులాటకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అత్యాచార యత్నం కాదని చెబుతున్నారు. ఎవరో ఆమెను తీసుకు వచ్చి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. కేవలం గొంతు పైన కొద్దిగా గాట్లు కనిపించాయని చెబుతున్నారు.
దీంతో ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. ఆధారాలు సేకరిస్తున్నామని, వైద్యులు ఇచ్చే ఆధారాలతో ఏం జరిగిందో చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. ఆధారాల కోసం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. జయలక్ష్మిది ఆర్కే బిచ్ వద్ద గల ఓట గడ్డ ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైలు కింద పడి ఆత్మహత్య
విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. వీరిని బొబ్బిలి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఓ బిస్కట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారని, వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.
అన్నా చెల్లెల్లు మృతి
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామంలో ఇద్దరు అన్నా చెల్లెళ్లు ఆడుకుంటూ వెళ్లి స్థానిక శివాలయం వద్ద ఉన్న కోనేటిలో పడి మృతి చెందారు. ఆరేళ్ల సతీష్, నాలుగేళ్ల దుర్గలు మృతి చెందారు. ప్రమాదవశాత్తూ వారి జారి కోనేటిలో పడ్డారు. దీంతో గ్రామం దుంఖసాగరంలో మునిగిపోయింది.