వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపిని వదిలేసి జగన్‌ను: దామోదర్, కోవర్టేమో: వివేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Damodar Reddy - Vivek
హైదరాబాద్/ కరీంనగర్: తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పచ్చి దుర్మార్గుడని కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఆర్.దామోదర్‌రెడ్డి ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అన్ని వ్యవహారాలు నడిపించింది కెవిపినే అని, ఇప్పుడు అన్ని విషయాలు చెప్పి తనను మాత్రం వదిలిపెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరి ఉంటాడని, ఆ కారణంగానే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

కెవిపి పిసిసి అధ్యక్షుడైతే తెలంగాణ వస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ అదేలా సాధ్యమని మీడియా ప్రతినిధులు అడిగితే కెవిపి పచ్చి సమైక్యవాది అని, కనీసం అప్పుడైనా తమ వాళ్లకు బుద్ధి వచ్చి కాంగ్రెస్ నుంచి బయటికి వస్తే అధిష్ఠానం దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందని ఆయన జవాబిచ్చారు. ఈసారి ఎన్నికల్లో తన తనయుడిని రంగంలోకి దించుతానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోవర్టుగా పని చేస్తున్నారేమో..? అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండు.. పోతేపో అనడానికి ఆయనెవరంటూ కిరణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎవరికో కోవర్టుగా పని చేస్తున్నారని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మారంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏకపక్ష వైఖరి వల్లే కాంగ్రెస్‌పార్టీ బలహీనపడుతోందని ఆయన విమర్సించారు.

పార్టీలో కొనసాగుతున్నవారిని ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. తమకు పదవులు కావాలని ఏనాడూ అధిష్ఠానం వద్ద ఒత్తి చేయడం లేదు గానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే తెలంగాణ ఎంపీలంతా ప్రధానిని కలిసి తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విన్నవించామని, అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు.

డిసెంబర్ 9 వరకు గడువు ఇచ్చామని, ఆలోపు తేలకపోతే మళ్లీ ఎంపీలమంతా సమావేశమై భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికనలు రూపొందించుకుని దశలవారీ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన వివరించారు.

English summary

 Congress senior MLA R Damodar Reddy has lashed out at Rajyasabha member KVP Ramachandar Rao. He said that KVP is the person for all the misdeeds in YS Rajasekhar Reddy's regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X