ములాయంకు 11 లక్షలతో గుడి: ప్రధాని పదవిపై వ్యాఖ్య
లక్నో: సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు అభిమానులు గుడి కడుతున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు, సినీ నటులపై ప్రేమతో అభిమానులు దేవాలయాలు నిర్మించడం తమిళనాడులో జరిగేది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్కు అది పాకింది. ములాయం అభిమానులు ఆయన పేరిట ఓ దేవాలయాన్ని రూ.11 లక్షలతో నిర్మిస్తున్నారు. ములాయం పుట్టిన రోజును పురస్కరించుకొని నవంబర్ 22న ఆలయ పనులు మొదలు పెట్టారు.

ఈ నేపథ్యంలో హనుమంతుడికి చాలీసా మాదిరిగా ములాయంపై భక్తితో రాయించిన సమాజ్వాదీ చాలీసాను పార్టీ నవంబర్ 22న విడుదల చేసింది. ఈ చాలీసాను సంకేత్ కవిగా పేరున్న హోమియో వైద్యుడు, కవి కమ్తా ప్రసాద్ కేసరి రాశారు. అయితే సమాజ్వాది పార్టీ, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం గుడిని వ్యతిరేకిస్తున్నారు. గుడికి, ప్రభుత్వానికి, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ తెలిపింది. గుడికి ప్రభుత్వం నుండి ఎలాంటి డబ్బు అందదని చెప్పింది.
మరోవైపు ములాయం సింగ్ ప్రధాన పదవిపై తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రధాని రేసులో లేనంటూనే అవకాశమొస్తే అంటూ చెప్పాడు. మాజీ గవర్నర్ ఎన్డీ తివారీతో కలిసి ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని పదవి రేసులో తాను లేనని, అవకాశం వస్తే కాదనబోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోటీలో తాను లేనన్నారు. గతంలో యుపి ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీలే తాను లేనని చెప్పారు.
అయితే పరిస్థితులే తనకు ఆ పదవిని కట్టబెట్టాయన్నారు. ఏదైనా పరిస్థితుల పైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. తివారీ మాట్లాడుతూ.. వచ్చే లోకసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, అందుకు తన వయస్సు సహకరించదని చెప్పారు. ఇప్పుడు తన వయస్సు 88 అని, 2014లో జరిగే ఎన్నికలకు వయస్సు సహకరించదన్నారు. కాంగ్రెసుకు గుడ్ బై చెప్పే విషయం, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా అన్న ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడలేదు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications