అక్రమాలు చెప్తా: 'గాలి'పై పోటీకి సై అన్న తపాలా గణేష్

తాజాగా తపాలా గణేష్ రాజకీయాల్లో గాలిని దెబ్బ తీసేందుకు రంగంలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. అక్రమ మైనింగ్తో రాష్ట్ర సంపదను దోచుకున్న గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన సోదరులకు మరోసారి ప్రజల ముందు నిలబడే నైతికత లేదని విమర్శించారు. గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తాను పోటీ చేస్తానన్నారు. ఓబుళాపురం గనుల్లో జరిగిన అక్రమాలపై గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తాను ఎన్నికల్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని చెప్పారు.
ఆయన చేసిన అక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడమే కాకుండా గాలి ఆస్తుల జప్తు కోరుతానన్నారు. ఇందుకు సమాజ పరివర్తన సమితి, జన సంగ్రామ పరిషత్కు చెందిన ఎస్ ఆర్ హిరేమఠ్, రాఘవేంద్ర కుష్టిగిలాంటి ప్రజా సంఘాల నాయకులతో చర్చిస్తానన్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తారన్న విలేకరుల ప్రశ్నకు సమాధానంగా.. తన అభిప్రాయాలు, ఆలోచనలకు మద్దతు ఇచ్చే పార్టీ తరపున, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications