శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే.. వైయస్ జగన్ తరహా యాత్ర

గతంలో ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన విషయం తెలిసిందే. వైయస్ చనిపోయిన తర్వాత నల్లకాల్వ వద్ద జగన్ తన తండ్రి హఠార్మణాన్ని తట్టుకోలేక మృతి చెందిన వారిని ఓదార్చుతానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అతను ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆయన ఓదార్పు యాత్ర జైలుకు వెళ్లే ముందు వరకు కూడా కొనసాగింది.
తెలంగాణ ప్రాంతంలోనూ ఓదార్పు చేపట్టాలకున్న సమయంలో ఆయన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. జైలు నుండి బయటకు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్రకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా చెబుతోంది. జగన్ ఓదార్పు తరహా ఇప్పుడు ఉద్దవ్ మహాయాత్ర చేయనున్నారు. ఏ అంశంతో యాత్ర చేపట్టినా జగన్, ఉద్దవ్ ఇద్దరు యాత్రలు తమ తండ్రులు మృతి చెందిన తర్వాత ప్రారంభిస్తున్నారు. వారి వారి రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడం కోసమే ఈ యాత్రలు.
థాకరే స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
బాల్ థాక్రే సీట్లో కూర్చోలేనని, ఆయన స్థానాన్ని ఎవరూ పూడ్చలేరని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ అన్నారు. పార్టీ చీఫ్ పదవిని మరొకరితో పూర్తి చేయలేమని స్పష్టం చేశారు. శనివారం పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాలను వెల్లడించారు. ఆదివారం పత్రికలో ఇంటర్వ్యూ వివరాలు ప్రచురితమయ్యాయి. నవంబర్ 17న థాక్రే చనిపోయారని, అయినా ఎప్పటికీ ఆయన శివసేన చీఫ్గా, హిందువుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications