కిరణ్ ఆంగ్లేయుడు:వర్షంలో నల్లడ్రెస్తో భూమన నిరసన

దీంతో ఆయన వర్షంలోనే నల్లబట్టలతో తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆన మాట్లాడారు. ఏర్పాట్లలో తెలుగు భాషను అవమానపరుస్తున్నారని భూమన దుయ్యబట్టారు. ఆంగ్ల పదాలు వాడటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంగ్లేయుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు ప్రపంచ తెలుగు మహా సభలు అని చెబుతూనే మరోవైపు భాషను అవమానపరిస్తే ఊరుకునే సమస్య లేదన్నారు.
తెలుగు మహాసభలను కాంగ్రెసు పార్టీ మేళాగా నిర్వహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తనకు చాలా బాధ కలిగించాయన్నారు. సచివాలయం, తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలుగు భాష అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన తెలుగు మహాసభల్లో చేసిన తీర్మానాల అమలుకే దిక్కులేదని భాషాభిమానులు వాపోతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications