సాంబారులో పాము: ఇంకా షాక్లోనే ఉన్న మహిళ
మంగమ్మాయ్ ఆ అస్తిపంజరాన్ని ఇరుగుపొరుగువారికి చూపించింది. చివరకు అది నాగుపాము అస్తిపంజరం అని ఒకరు గుర్తించారు. ఇంతలోనే ఆమెను అస్వస్థత ఆవరించింది. వాంతులు చేసుకుని స్పృహ తప్పింది. గ్రామంలోని క్లినిక్కు ఆమెను తరలించారు.
పాము కుట్టినప్పుడు శరీరంలోకి ఎక్కే విషం లాంటి సూచనలే మంగమ్మాయ్లో కనిపించాయి. మంగమ్మాయ్ని ఆ తర్వాత తిరువల్లూరు జిల్లాలోని తిరుత్తని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మళ్లీ ఆరో తేదీన ఆమె వాంతులు చేసుకుంది. తన చుట్టూ పాములు కనిపిస్తున్నాయని ఆమె భర్తతో అనడం సాగించింది.
ఆ తర్వాత చెకప్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు తేలింది. మంచి చికిత్స అందిస్తున్నప్పటికీ భయంతో దాని నుంచి కోలుకోలేకపోతోంది. ఆమె మానసికంగా దెబ్బ తిన్నదని వైద్యులు అంటున్నారు. సాంబారులో మీకు పాముల అస్తిపంజరాలు కనిపిస్తాయోమో, జాగ్రత్తగా చూడండని ఆమె తన బంధువులతో అంటోంది.
అయితే, అందులోని అస్తిపంజరం పాముదై ఉండదని, బల్లిది గానీ, లేదా చేప ఎముకలు గానీ అయి ఉంటాయని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ ప్రతాప్ అంటున్నారు. మంగమ్మాయ్ సమస్య మానసికమైందని, ఈ చికిత్స ద్వారా అది ఆమె కోలుకునే అవకాశాలు లేవని అంటున్నారు.