వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధేశ్వరిపై ఎన్టీఆర్ అభిమానులకు చంద్రబాబు లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Purandeswari
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి పురంధేశ్వరి తీరును తప్పుపడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు అభిమానులకు, పార్టీ అభిమానులకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం విషయంలో పురంధేశ్వరి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని పురంధేశ్వరి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

అప్పుడు మౌనం వహించిన ఆమె ఇప్పుడు మాత్రమే ఎందుకు పెదవి విప్పారో చెప్పాలన్నారు. తెలుగు మహాసభల పుస్తకాల్లో ఎన్టీఆర్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఎన్టీఆర్‌కు అవమానం జరిగినా ఆమె పెదవి విప్పడం లేదన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నారు. ఆ దిశలో పురంధేశ్వరి కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నెల 7న పురంధేశ్వరి రాసిన లేఖ పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్నదని ఆయన చెప్పారు. కాగా ఇటీవల పార్లమెంటులో నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టేందుకు స్పీకర్ మీరా కుమార్ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘం అనుమతించిందని, విగ్రహాన్ని ఇవ్వాలని పురంధేశ్వరికి స్పీకర్ లేఖ రాశారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has 
 
 wrote a letter to late party fans about NTR statue in 
 
 Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X