భార్య, కూతురు గొంతుకోసి చంపిన కానిస్టేబుల్
రోజూ గొడవ జరుగుతుండటంతో వనజ శనివారం రాత్రి తన కొడుకు రమాకాంత్ను పక్కనున్న వారి ఇంట్లో పడుకోబెట్టింది. కూతురు ప్రజ్ఞతో పాటు వనజ మాత్రం ఇంటిలోనే నిద్రించింది. తాగి వచ్చిన వెంకటేష్ శనివారం రాత్రి భార్యతో గొడవకు దిగాడు. అది చినికి చినికి గాలివానగా మారింది. తాగిన మత్తులో అతను భార్య, కూతురు గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత త్రీ టౌన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
కుటుంబ కలహాల కారణంగానే సదరు కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఎదురింట్లో పడుకోబెట్టడంతో కొడుకు రమాకాంత్ సేఫ్గా ఉన్నాడు. వెంకటేష్ రోజూ తాగి వచ్చే వాడని, భార్యతో గొడవపడే వాడని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ సాగిస్తున్నారు.
భార్యకు నిప్పంటించిన కానిస్టేబుల్
గుంటూరు జిల్లాలో మరో కానిస్టేబుల్ తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తున్నకిషోర్ తన భార్యపై కిరోసిన్ పోసి ఆమెను చంపేందుకు నిప్పు అంటించాడు. గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. బంధులవు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భర్త రెండోపెళ్లి చేసుకొని తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెంగళాయపాలెంలో జరిగింది.