ఐరాస అడ్వైజర్గా తాలిబన్ మలాలా యూసఫ్ తండ్రి
బ్రిడన్ మాజీ ప్రధాన గార్డన్ బ్రౌన్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బ్రౌన్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విద్య ప్రత్యేక రాయబారి. మలాలా పూర్తిగా కోలుకున్నాక ఆమె తమ ప్రచారంలో పాల్గొంటుందని చెప్పారు. బాలికల విద్య కోసం మలాలా పేరుతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నిధికి పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ దాదాపు రూ.55 కోట్ల విరాళం ప్రకటించారు. మలాలా ప్రస్తుతం లండన్లో ఉంది.
కాగా పాకిస్తాన్లో తాలిబన్లు ఇటీవల పద్నాలుగేళ్ల మలాలాపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. తమకు వ్యతిరేకంగా, విద్యకు అనుకూలంగా గళం విన్పించిందనే ఆగ్రహంతో ఓ బాలిక కార్యకర్తపై కిరాతంగా కాల్పులు జరిపారు. తమ దుశ్చర్యలను దనుమాడిందనే దుగ్దతో ఆ చిన్నారిపై హత్యాయత్నం చేశారు.
బాలికా విద్యపై ఇస్లాం తీవ్రవాదుల వైఖరిని వ్యతిరేకించి చిన్నవయసులోనే అత్యంత ధీశాలిగా పాకిస్థాన్లో ఖ్యాతికెక్కిన మాలాల యూసఫ్ జాయ్ను అంతం చేసేందుకు ప్రయత్నించారు. బడి నుంచి పాఠశాల బస్సులో ఇంటికి వెళుతున్న మాలాలపై కర్కశ దుండగుడొకడు తుపాకీతో రెండుసార్లు కాల్చాడు. ఆమె ఆ తర్వాత లండన్లో చికిత్స పొందుతున్నారు.