వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొందరెందుకు: ధర్మానపై గవర్నర్, కిరణ్‌తో విభేదాల్లేవు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Governor Narasimhan
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని గవర్నర్ నరసింహన్ శుక్రవారం అన్నారు. ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. పలువురు నేతలను ఆయనను కలుస్తున్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎంతో విభేదాలు అవాస్తవమన్నారు. ఎవరైనా పదవిలో ఉన్నప్పుడు విమర్శలు రావడం సర్వ సాధారణమే అని నరసింహన్ చెప్పారు. రాజ్యాంగం, రాజకీయాలు వేరు వేరు కాదన్నారు.

ఏఐసిసి పెద్దలను కలవడం తప్పు కాదన్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామా వ్యవహారంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మూడు నెలల్లోగా ఫైల్ క్లియర్ చేయమని కోర్టు చెప్పలేదన్నారు. ఫైల్ క్లియర్‌కు ఎలాంటి కాల పరిమితి లేదన్నారు. ఈ నెల 28న తెలంగాణపై జరగనున్న అఖిల పక్ష సమావేశంపై తాను ఏఐసిసి పెద్దలతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు.

ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్‌కు అంత తొందరెందుకని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు, ఆరోపణలు రావడం సహజమే అన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్ర దేవ్ లేఖ పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు. మీ విమర్శలు మీరు చేసుకోవచ్చన్నారు. కాగా నరసింహన్ కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి తదితరులను కలిశారు. చిదంబరం, ఆంటోనీలను కలవనున్నారు.

కాగా గురువారం నరసింహన్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వచ్చానని, ఇక్కడకు తాను రాకపోతే మీడియా మర్చిపోతుంది కదా అని సెటైర్ వేశారు. స్నేహితులను చూసి వెళ్దామని వచ్చానని, వచ్చినప్పుడు పెద్దవాళ్లందర్నీ కలవాలన్నారు. తన పర్యటనలో అధికారం, వ్యక్తిగతం ఏమీ లేదని, అన్నీ సాధారణ అంశాలే అన్నారు. ఢిల్లీకి ఊరికే వచ్చానని, చల్లగా ఉందని వచ్చానన్నారు.

English summary
Governor Narasimhan said he has no differences with CM Kiran Kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X