కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆస్తి ధ్వంసం: వైయస్ జగన్‌పై విచారణ ఉపసంహరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి ధ్వంసం కేసు ప్రాసిక్యూషన్‌ను సోమవారం ఉపసంహరించుకుంది. వైయస్ జగన్‌తో సహా మరో 31 మంది పైన ప్రభుత్వం విచారణను ఉపసంహరించుకుంది. వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల పైన 2011లో పులివెందులలో ఆస్తి ధ్వంసం కేసు నమోదయింది. ఈ కేసులోనే విచారణను ప్రభుత్వం సోమవారం ఉపసంహరించుకుంది.

కాగా కడప జిల్లాలోని పులివెందుల పోలీసు స్టేషన్‌లో వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు అక్టోబర్ 10, 2011లో కేసు నమోదు చేశారు. జగన్‌తో సహా మరికొందరిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై వచ్చిన అభియోగాలపై మొత్తం పదకొండు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం తదితర అభియోగాలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

అంతకుముందు రోజు ఆదివారం సాయంత్రం జగన్ పులివెందుల పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన కార్యకర్తలను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

English summary
Government withdraws prosecution on YSR Congress party chief YS Jaganmohan Reddy in Pulivendula case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X