అనుమతిస్తే అల్లూరి విగ్రహమిస్తా: స్పీకర్కు కృష్ణంరాజు
స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఇచ్చేందుకు పురందేశ్వరిని అనుమతించారని, అదే విధంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇచ్చేందుకు తనకు అనుమతివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అల్లూరి విగ్రహ ఏర్పాటుకు 2000లో స్పీకర్గా ఉన్న జిఎంసి బాలయోగి అనుమతించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహాలు ఇవ్వాల్సి ఉండగా, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఇస్తామంటూ 2006లో ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 12, 13వ లోక్సభలకు తాను ప్రాతినిధ్యం వహించానని కృష్ణం రాజు తెలిపారు.
అల్లూరి విగ్రహంపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రస్తావించగా రూ.25 లక్షల వ్యయమయ్యే ఈ విగ్రహాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చానని చెప్పారు. గతంలోనే అల్లూరి విగ్రహ ఏర్పాటుకు స్పీకర్ అనుమతి ఇచ్చారని, మళ్లీ అనుమతి పొందాల్సిన అవసరం లేదని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చెప్పారు.