భారత్ దేశాన్ని వెయ్యేళ్లు పాలించాం కానీ..: అసదుద్దీన్
ముస్లింలు ఐక్యత గా ఉంటేనే తమ ఉనికిని చాటుకోగలరని, చిన్న చిన్న విభేదాలను విడనాడీ ఐక్యతగా ఉంటేనే పరిపాలించే హక్కును సాధించుకోగల్గుతామన్నారు. 65 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ ముస్లింలు నివసించే ప్రాంతాలు మురికి కూపంలా కనబడుతున్నాయన్నారు. నిరుద్యోగం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కమిషన్ కూడ ముస్లింల వెనుకబాటుతనం గురించి నివేదిక ఇచ్చినా అభివృద్ధి చర్యలు శూన్యమన్నారు.
ముస్లింలు బలహీనులు అనుకుంటే పొరపాటు అన్నారు. ఈ దేశంలో ఎవరికి వారు తమ తమ సంఘాలను ఏర్పాటు చేసుకొని రాజ్యమేలుతున్నారని, ఇదే మాటను మజ్లిస్ చెబితే మాత్రం మతం రంగును పులుముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ మతతత్వ పార్టీ కాదన్నారు. సచార్ కమిటీ ముస్లింల స్థితిగతులపై ఇచ్చిన నివేదికలో ముస్లింల పరిస్థితి ఎస్సీ, ఎస్టీ కంటే హీనంగా ఉందని పేర్కొందన్నారు.
దేశంలోని పలు ప్రాంతాలలో ముస్లింలపై దాడులు జరిగి నప్పుడు ఎంఐఎం స్వయంగా అక్కడికి వెళ్ళి పరిస్థితులను చక్కదిద్దడమే కాకుం డా కుల, మతాలకు అతీతంగా ప్రజలను ఆదుకుందన్నారు. ముస్లింలు వివిధ పార్టీ లకు ఓటు బ్యాంకులు కాదన్న విషయా న్ని గుర్తుంచుకోవాలన్నారు. కిరణ్ సర్కా ర్ ముస్లింలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.