పదేళ్లలో 123 బిలియన్ డాలర్ల సొమ్ము తరలిపోయింది
మెక్సికో 476 బిలియన్ డాలర్లు, మలేషియా 285 బి.డా., సౌదీ అరేబియా 201 బి.డా., రష్యా 152 బి.డా., పిలిప్సీన్ 138 బి.డా., నైజీరియా 129 బి.డా.గా ఉంది. ఆ తర్వాత భారత్ 123 మిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. బ్లాక్ మనీ తరలిపోయిన టాప్ 20 ఆసియా దేశాల్లో భారత్ తప్ప మరే దేశం లేదు.
కేవలం ఒక్క 2010లోనే భారత్ నుండి అక్రమంగా తరలిపోయిన మొత్తం రూ.8,752 కోట్లుగా ఉందట. దీనిని జిఎప్ఐ అనే సంస్థ వెల్లడించింది. 6,73,056(123 బిలియన్ డాలర్లు) కోట్లు కోల్పోవడం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తమే అని జిఎఫ్ఐ ఆర్థిక వేత్త అన్నారు.
భారత పౌరులపై దీని ప్రభావం ఎక్కువేనని, విద్య, వైద్యం, మౌలిక వసతుల మెరుగుకు ఈ మొత్తం ఉపయోగపడి ఉండేదని, ఇందులో కొంత మొత్తం భారత్లోనే ఉండి ఉంటే జాతీయ పవర్ గ్రిడ్లో పెట్టుబడులు పెట్టడానికి ఉపకరించేదని, గత వేసవిలో విద్యుత్ సంక్షోభం ఎదురయి ఉండేది కాదని పేర్కొన్నారు.