రేపిస్టులకు ఉరే సరి: లోకసభలో సుష్మా, జయ కన్నీళ్లు

ఢిల్లీలో మహిళల భద్రతపై ఉభయ సభల్లో మహిళా సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ కేసుపై శరవేగంగా దర్యాప్తు జరుపుతామని, పోలీసుల వైపు తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని షిండే హామీ ఇచ్చారు. సామూహిక అత్యాచారం ఘటనపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ మంగళవారం సభ్యులు తమంతట తాముగా స్పందించారు. ఇటువంటి ఘటనలు మొత్తం సమాజానికే అవమానకరమని, కేంద్రం వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు.
డిఎంకె సభ్యురాలు వసంతి స్టాన్లే, అన్నాడిఎంకె కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎంపి గిరిజా వ్యాస్ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి శిక్ష విధిస్తే అత్యాచారం చేసిన తర్వాత మహిళలను చంపేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరాలను అదుపు చేయడంలో విఫలమైన ఢిల్లీ పోలీసు చీఫ్ను వెంటనే తొలగించాలని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications