జగన్ పార్టీ: భేటీలో తడబాటు, తర్వాత సర్దుబాటు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావుపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా వైఖరి చెప్పినప్పటికీ, కేవలం ఉనికి కోసం తమ పార్టీపై కెసిఆర్ తప్పుడు విమర్శలు చేస్తున్నారని వారు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. ఓట్లు, సీట్లు పొందటానికే శనివారం బంద్కు పిలుపునిచ్చారని ఆరోపించారు. జగన్ జైలు నుంచి బయటికి వచ్చాక ఉత్తర తెలంగాణలోనూ కెసిఆర్కు చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.
ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు జోకర్లలా మాట్లాడుతున్నారని పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్థన్, జనక్ ప్రసాద్ తదితరులు విమర్శించారు.తెలంగాణపై సోనియాగాంధీని అడిగే దమ్ములేని తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు తమ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. ఇతర పార్టీల్లాగా తాముకాదని, రాయలసీమ నడిబొడ్డున(ఇడుపులపాయ ప్లీనరీలో) జగన్ 'జై తెలంగాణ' అన్నారని చెప్పారు. తమ పార్టీపై అవాకులు, చెవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
అన్ని పార్టీలు తమ వైఖరి చెప్పినా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఎంపీలు సిగ్గులేకుండా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణపై తాము స్పష్టంగా చెప్పామని తెలంగాణకు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications