తెలంగాణ: బాబు నిర్ణయానికి ఎంపి నో, లగడపాటి దార్లో

ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తానన్నారు. పార్లమెంటులో సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక రాష్ట్రానికి టిడిపి సానుకూల వైఖరి ప్రదర్శించడంపై పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తమకు సమైక్యాంధ్రనే ముఖ్యమని, రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని అన్నారు. సీమాంధ్ర సమైక్యతనే కోరుకుంటున్నారన్నారు.
కర్ణాటకలో నిర్మించిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఇప్పటికే నీటి ఎద్దడి ఏర్పడిందని, తెలంగాణ ఏర్పడితే కోస్తాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాదిరిగా టిడిపి తరఫున తాను కూడా చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications