వైయస్ జగన్ కోసం నన్ను అడ్డుకుంటారా: మోపిదేవి

శబరిమల వెళ్లిరావడానికి మధ్యంతర బెయిల్ పొందిన మోపిదేవి గురువారం కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం మోపిదేవిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మోపిదేవి తన పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోందని ఆ పత్రిక రాసింది.
వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్లే నడుచుకున్నానని, వైయస్ మాట మేరకే ఫైళ్లపై సంతకాలు చేశానని, తన తప్పేమీ లేదని, ఎందులోనూ తన ప్రమేయం లేదని, అయినా అరెస్ట్ చేశారని అన్నట్లు సమాచారం. అప్పటికీ సీబీఐ వ్యవహారంపై చాలాసార్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిశానని, అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానం వ్యక్తం చేశానని, కిరణ్ కుమార్ రెడ్డి కూడా సరిగా పట్టించుకోలేదని, ఏమీ కాదని సర్దిచెప్పారని, ఇప్పుడు తాను బలిపశువునయ్యానని మోపిదేవి అన్నట్లు తెలుస్తోంది.
అరెస్ట్ జరిగి 8 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం రాలేదని, తన కుటుంబ సభ్యులు తీవ్రంగా కలత చెందుతున్నారని తన ఆవేదనను వెల్లబోసుకున్నట్లు తెలుస్తోందంటూ ఓ తెలుగు దినపత్రిక వ్యాఖ్యానించింది. తాను బయటకు వస్తే జగన్ కూడా బెయిల్పై బయటకు వస్తారంటున్నారని, అందుకే తనకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన అన్నట్లు తెలుస్తోంది.
తనకు, జగన్కు ఏం సంబంధమని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. తనకు బెయిల్ ఇస్తే.. జగన్కు ఎందుకు ఇస్తారని మోపిదేవి వ్యాఖ్యానించారు. మంత్రి ధర్మాన విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకున్నట్లే.. తన విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించి ఉంటే బాగుండేదని మోపిదేవి అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications