తెలంగాణపై సంకేతాలు: భయంవద్దని లగడపాటి హామీ!

త్వరలో జరగనున్న ప్రాంతీయ సదస్సులో తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చర్చించమన్నారు. ఈ సమావేశం ప్రాంతాల గురించి కాదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల గురించి అన్నారు. తెలుగు నేలను, గడ్డను, నీటిని ఎవరూ విడదీయలేరన్నారు. విభజనపై ఎవరికీ ఎలాంటి ఆందోళన, భయం వద్దని హామీ ఇచ్చారు. విభజన జరగదని ఇప్పటికే అర్థమయిందని, అర్థం కాని వారు ఎవరైనా ఉంటే తెలుసుకోవాలని సూచించారు.
కాగా అంతకుముందు ఈ నెల 7వ తేదిన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న కాంగ్రెసు పార్టీ ప్రాంతీయ సమావేశాల ఏర్పాట్లు పరిశీలించేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చారు. ఆయన కూడా తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నిర్ధిష్టమైన ప్రకటన చేస్తే తాము దానికి తప్పకుండా కట్టుబడి ఉంటామని చెప్పారు.
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణ సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి, కలిసి ఉండటానికి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఊసర వెల్లి రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రాంతాల వారిగా ప్రజలను టిడిపి మభ్యపెడుతోందన్నారు.












Click it and Unblock the Notifications