మా కడుపుమంట తెల్సు, కెసిఆర్నే అడగాలి: దామోదర

హైదరాబాదు ప్రజలు కూడా తెలంగాణను కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ అధిష్టానం, కేంద్రం 9 డిసెంబర్ 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 28 వరకు తెలంగాణకు పరిష్కారం చూపిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగానే ప్రకటన ఉంటుందని భావిస్తన్నానని అన్నారు.
తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేస్తారో లేదో అనే విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును అడగాలన్నారు. పార్టీలో యువ నాయకత్వం అవసరం చాలా ఉందన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులుగా యువనేత రాహుల్ గాంధీని ఎన్నుకోవడం ఆనందించదగ్గ విషయం అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే తాము 2014లో ఎన్నికలకు వెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయో విజయం సాధిస్తుందన్నారు.
కెసిఆర్కు న్యూడెమోక్రసీ ఆహ్వానం
న్యూడెమోక్రసీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి న్యూడెమోక్రసీ అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా ఆహ్వానం అందింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications