మా కడుపుమంట తెల్సు, కెసిఆర్నే అడగాలి: దామోదర
హైదరాబాదు ప్రజలు కూడా తెలంగాణను కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ అధిష్టానం, కేంద్రం 9 డిసెంబర్ 2009 నాటి ప్రకటనకు కట్టుబడి ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నెల 28 వరకు తెలంగాణకు పరిష్కారం చూపిస్తామని కేంద్రం చెప్పిందన్నారు. ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగానే ప్రకటన ఉంటుందని భావిస్తన్నానని అన్నారు.
తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెసులో విలీనం చేస్తారో లేదో అనే విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును అడగాలన్నారు. పార్టీలో యువ నాయకత్వం అవసరం చాలా ఉందన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులుగా యువనేత రాహుల్ గాంధీని ఎన్నుకోవడం ఆనందించదగ్గ విషయం అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనే తాము 2014లో ఎన్నికలకు వెళతామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయో విజయం సాధిస్తుందన్నారు.
కెసిఆర్కు న్యూడెమోక్రసీ ఆహ్వానం
న్యూడెమోక్రసీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి న్యూడెమోక్రసీ అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా ఆహ్వానం అందింది.