మూడేళ్ల చిన్నారిపై యువకుడి దాష్టీకం, హత్య

Young kills 3 year old girl
కరీంనగర్/శ్రీకాకుళం: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓదెల రైల్వే స్టేషన్ సమీపంలో ఒక కుటుంబం నివాసం ఉంటోంది. మంగళవారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. వారికి మూడేళ్ల పాప ఉంది. ఆమెను పెద్దమ్మ ఇంట్లో వదిలి వెళ్లారు. ఓదెల రైల్వే స్టేషన్ వెనుకాలే ఉన్న వారి ఇంటి ఆవరణలో ఆ చిన్నారి పిల్లతో ఆడుకుంటున్న సమయంలో అదిలాబాదు జిల్లాకు చెందిన రాజేష్ అనే వ్యక్తి పిల్లలకు బిస్కట్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు.

అందరూ అక్కడి నుండి వెళ్లగానే మూడేళ్ల ఈ పాపను పక్కనే ఉన్న పత్తి చేలోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బిస్కట్లు కొనుక్కునేందుకు వెళ్లిన పిల్లలు వచ్చే సరికి రాజేష్ పాపను భజంపై వేసుకొని బావి వైపు వెళ్తూ కనిపించాడు. పిల్లలకు అనుమానం వచ్చి పెద్దలకు చెప్పారు. పెద్దలు వచ్చి చూడగా చిన్నారి మృతి చెంది ఉంది. ఆమెను బావిలో పడేసేందుకు రాజేష్ ప్రయత్నించగా వారు చూశారు. స్థానికులు రాజేష్‌ను కట్టేసి కొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

పడవ బోల్తా

శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని బందరువానిపేట వద్ద ఉదయం సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్సకారుల పడవ ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో లక్ష్మయ్య అనే యాభై అయిదేళ్ల వ్యక్తి మృతి చెందాడు. పడవలో ఉన్న మిగతా వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+