హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీము నెత్తురుంది, మేమూ కూల్చగలం: కోమటిరెడ్డి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని పార్టీ అధిష్టానాన్ని బెదిరించి ఈ నెల 28న తెలంగాణపై ప్రకటన రాకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కోమటిరెడ్డి ఉదయం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

సీమాంధ్ర నేతలు బెదిరించి అడ్డుకున్నారని, తమకు ప్రభుత్వాన్ని కూల్చే శక్తి లేదా అని ఆయన ప్రశ్నించారు. తమకు చీము, నెత్తురు ఉన్నాయని అన్నారు. తాము ప్రభుత్వాన్ని కూల్చగలమన్నారు. బెదిరించి తెలంగాణను అడ్డుకుంటారా అని ఆయన సీమాంధ్ర నేతలపై నిప్పులు చెరిగారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన రాకుంటే తమ తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు.

రెండు రోజుల్లో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వస్తుందన్న తరుణంలో సీమాంధ్ర నేతలు లాబీయింగ్ చేసి అడ్డుకోవడం బాధాకరమన్నారు. కెసిఆర్‌తో భేటీ అయిన కోమటిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

కెసిఆర్‌ను కలవడంలో తప్పులేదు

తన సోదరుడు కెసిఆర్‌ను కలవడంలో ఎలాంటి తప్పులేదని ఢిల్లీలో ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రకటించకుంటే బడ్జెట్ సమావేశాలు జరగనిచ్చేది లేదన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసే తీసుకుంటామన్నారు.

సామాజిక బహిష్కరణ

ఈ నెల 28వ తేదిలోగా తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. లేదంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలే మా టార్గెట్ అన్నారు. వారిని సామాజికంగా బహిష్కరిస్తామన్నారు. జెఏసి సమావేశాలకు కాంగ్రెసు పార్టీ నేతలను పిలిచేది లేదన్నారు.

కేంద్రం తనకు తాను విధించుకున్న 28 డెడ్ లైన్ లోపు ప్రకటన చేయాలన్నారు. లేదంటే ఆ రోజు సాయంత్రం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమర దీక్ష, ఆమరణ దీక్షలపై ఎలాంటి ఊహాగానాలు వద్దని సూచించారు. ఏది ఉన్నా ముందే చెబుతామన్నారు. పోలీసులు సమర దీక్షకు అనుమతిని ఇచ్చారన్నారు.

English summary
Former Minister Komatireddy Venkat Reddy has lashed out at Seemandhra leaders for stalling Telangana announcement by Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X